'ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం' పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
- ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జీవోలు
- హైకోర్టును ఆశ్రయించిన విద్యాసంస్థలు
- స్టే ఇచ్చిన హైకోర్టు
- విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకురావొద్దని ఉత్తర్వులు
- తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా
సమ్మతి తెలపలేదన్న కారణంతో విద్యాసంస్థలకు నిధుల మంజూరు నిలిపివేయవద్దని పేర్కొంది. ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందుకు ఈ నెల 22 వరకు గడువు విధించింది. కాగా, దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఎయిడెడ్ విద్యాసంస్థలు ఇష్టపూర్వకంగా సమ్మతి తెలిపితేనే ప్రభుత్వం తదుపరి ప్రక్రియ కొనసాగిస్తోందని, విద్యాసంస్థలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడంలేదని స్పష్టం చేశారు.