కరోనా నుంచి కోలుకున్నా వదలని ఇబ్బందులు.. చిన్నపేగుల్లో గడ్డకడుతున్న రక్తం!
- కరోనా బాధితులను వేధిస్తున్న ఇతర సమస్యలు
- తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ నిమ్స్లో చేరిన ఆరుగురు
- చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టి గ్యాంగ్రేన్గా మారిన వైనం
- ఇద్దరి పరిస్థితి విషమం
కాగా, బాధితులు ఆరుగురికి కరోనా సోకినట్టు తెలియకపోవడం గమనార్హం. వీరు కరోనా తొలి డోసు తీసుకున్నారని, వారిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కరోనా సోకిన తర్వాత కొందరిలో రక్తం గడ్డకట్టే ప్రమాదముంది. తాజాగా, ఆసుపత్రిలో చేరిన వీరిలోనూ కొన్ని రోజుల క్రితమే రక్తం గడ్డకట్టినట్టు తెలిపారు. పేగులకు రక్తప్రసరణ సరిగా జరగక పోవడంతో అక్కడ కణజాలం చనిపోయి గ్యాంగ్రేన్గా మారిందని వైద్యులు తెలిపారు.