తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 41,690 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,541 మందికి చికిత్స
అదే సమయంలో 258 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,66,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,57,923 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,541 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,920కి పెరిగింది.
