Panja Vaisshnav Tej: సెన్సార్ పూర్తిచేసుకున్న'కొండ పొలం'

  • గిరిజనుల సమస్యలే ప్రధాన ఇతివృత్తం  
  • ప్రకృతి సాక్షిగా నడిచే ప్రేమకథాంశం
  • సెన్సార్ నుంచి 'యు' సర్టిఫికెట్
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల
Kondapolam censore completed

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా క్రిష్ 'కొండ పొలం' సినిమాను రూపొందించాడు. అడవిని నమ్ముకున్న కొంతమంది గిరిజనులు .. వాళ్ల జీవనోపాధికి అడ్డుపడే కొంతమంది బలవంతుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ క్రమంలో తన తాత .. తండ్రి నుంచి అడవిని ఇల్లుగా భావిస్తూ వచ్చిన ఓ యువకుడు ఏం చేశాడనేదే కథ.

అడవిలోని గిరిజనులు తమ మనుగడ సాగించడానికి ఒక వైపున క్రూర మృగాలతోనే కాదు, అంతకంటే క్రూరంగా ఆలోచించే కొంతమంది మనుషులతో కూడా పోరాటం చేయవలసి వస్తుందనే విషయాన్ని, ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ కి విశేషమైన స్పందన వస్తోంది.

సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, 'యు' సర్టిఫికెట్ తెచ్చుకుంది. రకుల్ ఈ సినిమాలో గిరిజన యువతిగా నటించడం .. సింపుల్ మేకప్ తో కనిపించనుండటం విశేషం. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, అక్టోబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నారు..

More Telugu News