Posani Krishna Murali: పోసానిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ పోలీసుల‌కు ఫిర్యాదు.. కంప్లైంట్ చేసేందుకు పోసాని కూడా సిద్ధం

  • ప‌వ‌న్‌పై పోసాని తీవ్ర వ్యాఖ్య‌లు
  • ప‌వ‌న్ అభిమానుల ఆగ్ర‌హం
  • ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయ‌నున్న పోసాని
complaint against posani

జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీన‌టుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోసానిపై జనసేన నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.  

దీంతో పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పోసాని కూడా పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే  ఫిర్యాదు చేయాల‌ని నిర్ణయించుకున్నారు. ఇలా జనసేన కార్యకర్తలు, పోసాని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటోన్న నేప‌థ్యంలో ఉత్కంఠ నెల‌కొంది.

వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఏపీ మంత్రులు కూడా విరుచుకుప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేసేందుకు ఉద్దేశ‌పూర్వకంగానే వైసీపీ పోసానిని దించింద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

  • Loading...

More Telugu News