పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్... ముంబయి ముందు స్వల్ప లక్ష్యం

Punjab set low target for Mumbai
  • ఐపీఎల్ లో పంజాబ్ వర్సెస్ ముంబయి
  • తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 రన్స్
  • లక్ష్యఛేదనలో ముంబయి తడబాటు
  • 16 పరుగులకే రెండు వికెట్లు డౌన్
ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. అయిడెన్ మార్ క్రమ్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. దీపక్ హుడా 28, కెప్టెన్ కేఎల్ రాహుల్ 21 పరుగులు చేశారు. గేల్ (1), నికొలాస్ పూరన్ (2) నిరాశపరిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 2, పొలార్డ్, రాహుల్ చహర్ 1, కృనాల్ పాండ్య 1 వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి తడబడింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (8), సూర్యకుమార్ యాదవ్ (0)లను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు.
Go Back to Shorts
Punjab Kings
Mumbai Indians
Abudabhi
IPL

More Telugu News