Balineni Srinivasa Reddy: నాడు తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలకు వచ్చిన వారికే పెన్షన్లు ఇచ్చారు: మంత్రి బాలినేని

Balineni comments on pensions issue
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో పింఛన్ల అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలకు వచ్చిన వారికే నాడు పింఛన్లు మంజూరు చేశారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2018 అక్టోబరు నాటికి పింఛన్లకు అర్హులు 50 లక్షల మంది ఉంటే, అప్పటి ప్రభుత్వం 39 లక్షల మందికే పింఛన్లు ఇచ్చిందని తెలిపారు. అయితే ఎన్నికలు సమీపించే సరికి ఆ లెక్కను అమాంతం పెంచేశారని బాలినేని వెల్లడించారు.

ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే, లక్షన్నర మందికి పెన్షన్లు తొలగించారని చంద్రబాబు తోక మీడియా నానా యాగీ చేస్తోందని మండిపడ్డారు. తమది బీసీల పార్టీ అని బాలినేని పేర్కొన్నారు. వైసీపీ పరంగానూ, అటు సీఎం జగన్ కానీ బీసీలకు కనీవినీ ఎరుగని రీతిలో ఇస్తున్న గుర్తింపే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Balineni Srinivasa Reddy
Pensions
TDP
YSRCP
CM Jagan
Andhra Pradesh

More Telugu News