వామపక్ష నేత సీతారాం ఏచూరి కుటుంబంలో విషాదం
- సీతారాం ఏచూరి తల్లి కల్పకం కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కల్పకం
- క్షీణించిన ఆరోగ్యం.. నేడు ఢిల్లీలో మృతి
కాగా, వైద్య పరిశోధనల నిమిత్తం తన తల్లి మృతదేహాన్ని ఆరోగ్య పరిశోధన సంస్థలకు అప్పగించాలని సీతారాం ఏచూరి నిర్ణయించుకున్నారు. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ గత వేసవిలో కరోనాతో కన్నుమూయగా, కొన్నినెలల తేడాతో ఆయన ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది.
కల్పకం మృతి పట్ల కేరళ సీఎం విజయన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు. కల్పకం సామాజిక వేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ కు ఆమె అభిమాని.