Vaishnav tej: 'కొండ పొలం' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • క్రిష్ నుంచి రానున్న 'కొండ పొలం'
  • గిరిజన ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • వచ్చేనెల 8వ తేదీన విడుదల    
Konda Polam trailer release date fixed

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'కొండ పొలం' సినిమా రూపొందింది. 'ఉప్పెన' కంటే ముందుగా వైష్ణవ్ తేజ్ చేసిన సినిమా ఇది. సాయిబాబు - రాజీవ్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, 'కొండ పొలం' అనే నవల ఆధారంగా రూపొందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు .. లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కొండప్రాంతం .. గిరిజన గూడెంలోని జీవన విధానం .. అక్కడ ఉన్న సమస్యలను కలుపుకుని సాగే అందమైన ప్రేమకథ ఈ సినిమా. లుక్స్ పరంగా వైష్ణవ్ తేజ్ .. రకుల్ ఇద్దరూ కూడా సింపుల్ మేకప్ తో కొత్తగా కనిపిస్తున్నారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..

More Telugu News