కేంద్రమంత్రి షెకావత్ ను కలిసి లేఖ అందజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్
- ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
- జల వివాదాలపై షెకావత్ తో చర్చ
- గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని విజ్ఞప్తి
- ముందు వాటాల సంగతి తేల్చాలని వినతి
కాగా, ఈ సమావేశంలో కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలో ఉంచాలని కోరారు. గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని, ముందు వాటాల సంగతి తేల్చాలని, ఆ తర్వాతే బోర్డుల పని చేపట్టాలని పేర్కొన్నారు. షెకావత్ తో కేసీఆర్ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు సాగింది.