కేంద్రమంత్రి షెకావత్ ను కలిసి లేఖ అందజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

CM KCR held meeting with union minister Gajendra Singh Shekawat
షార్ట్స్‌లో చూడండి
పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు. ఈ సమావేశంలో జల వివాదాలపై పలు అంశాలను షెకావత్ కు వివరించారు. ముఖ్యంగా 5 అంశాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు.

కాగా, ఈ సమావేశంలో కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలో ఉంచాలని కోరారు. గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని, ముందు వాటాల సంగతి తేల్చాలని, ఆ తర్వాతే బోర్డుల పని చేపట్టాలని పేర్కొన్నారు. షెకావత్ తో కేసీఆర్ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు సాగింది.
Go Back to Shorts
CM KCR
Gajendra Singh Shekhawat
Telangana
Andhra Pradesh

More Telugu News