టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టీకరణ
- వచ్చే ఎన్నికల్లో తాను కానీ, తన కుమార్తె కానీ పోటీ చేయబోమని ప్రకటన
- నేరుగా చంద్రబాబుకే ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం
- పార్టీలో మాత్రం కొనసాగుతానని స్పష్టీకరణ
అయితే, నాని ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. విజయవాడ మేయర్ ఎన్నికలు, బుద్ధా వెంకన్న, బోండా ఉమా తదితరులు తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదన్న మనస్తాపంతోనే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమాలకు కూడా నాని హాజరుకాకపోవడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.