విజయవాడలో దుకాణం తెరిచి... టన్నుల టన్నుల హెరాయిన్ ఎక్కడకు పంపిస్తున్నారు?: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి
- డ్రగ్స్ వ్యాపారానికి డీజీపీని అడ్డుపెట్టుకున్నారు
- వైన్ షాపుల్లో క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు?
- డ్రగ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నావో బయటపెడతాం
వైన్ షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మద్యం షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ ఆప్షన్లు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ జగన్ అంటూ మండిపడ్డారు. దమ్ముంటే రేపటి నుంచే అన్ని రంగాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను అందుబాటులోకి తీసుకురావాలని సవాల్ విసిరారు. వైన్ షాపుల్లో క్యాష్ మాత్రమే తీసుకుంటూ బ్లాక్ మనీ ఎలా సందపాదిస్తున్నావో బయటపెడతామని అన్నారు. రాష్ట్రంలో పోర్టులన్నింటినీ హస్తగతం చేసుకుని, డ్రగ్స్ ద్వారా వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నావో ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.