ప్రజలు మాటల మనిషి చంద్రబాబును కోరుకోవడం లేదు.. చేతల మనిషి జగన్ కావాలంటున్నారు: మంత్రి వెల్లంపల్లి
- పరిషత్ ఎన్నికల పలితాలతో విపక్షాల్లో గుబులు మొదలైంది
- రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు
- వైసీపీ మినహా రాష్ట్రంలో ఇతర పార్టీలకు చోటులేదు
- గుజరాత్లో పట్టుబడిన డ్రగ్స్తో విజయవాడకు సంబంధం లేదన్న మంత్రి
బుధవారం నాడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీల్లో 86 శాతం, జెడ్పీటీసీల్లో 98 శాతం సీట్లు వైసీపీకి దక్కిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలతో విపక్షాల్లో గుబులు మొదలైందని వెల్లంపల్లి అన్నారు. అలాగే డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతలు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో గుజరాత్లో పట్టుబడిన డ్రగ్స్తో విజయవాడకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.