ఏపీలో ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్
- ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు
- నేటి రాత్రికి పూర్తి ఫలితాలు
- ఈ నెల 24న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక
- ఈ నెల 25న జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక
ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. అనంతరం ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టనున్నారు. ఈ మేరకు ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.