ఏపీలో పరిషత్ ఎన్నికల తాజా ఫలితాలు ఇవిగో!
- ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు
- వైసీపీ ఆధిక్యం సుస్పష్టం
- ఇప్పటివరకు వైసీపీకి 4,150 ఎంపీటీసీ స్థానాలు
- 187 జడ్పీటీసీల్లో జయభేరి
ఈ ఫలితాలపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనం ఈ ఫలితాలు అని వెల్లడించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన టీడీపీకి లేదని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లోనూ ఓడిపోతామని తెలిసే టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మరో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, వైసీపీకి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.