ఎంఐఎం ఏ పార్టీకి భయపడదు.. అమిత్ షాకు మాత్రం నిద్రలోనూ మా పార్టీనే కలవరిస్తున్నారు: ఒవైసీ ఎద్దేవా
- దేశంలోని అన్ని పార్టీలకు ఎంఐఎం అంటే వణుకు
- ర్యాడికలైజేషన్ వల్ల ఎవరికి నష్టమో మోదీ గ్రహించాలి
- ఎంఐఎం అంటే భయం వల్లే షా తరచూ తెలంగాణ వస్తున్నారు
దేశంలోని అన్ని పార్టీలు తమను చూసి భయపడుతున్నాయి తప్పితే, తాము మాత్రం ఏ పార్టీకి భయపడబోమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా ఒవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ర్యాడికలైజేషన్ గురించి మాట్లాడుతున్నారని, నిజానికి అది ఎవరి వల్ల పెరిగిందో, ఎవరికి నష్టమో తెలుసుకోవాలని ఒవైసీ సూచించారు.