సెన్సార్ పూర్తి చేసుకున్న 'రిపబ్లిక్'
- కలెక్టర్ పాత్రలో సాయితేజ్
- పొలిటికల్ లీడర్ గా రమ్యకృష్ణ
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- అక్టోబర్ 1వ తేదీన సినిమా రిలీజ్
సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. కలెక్టర్ పాత్రను సాయితేజ్ పోషించిన ఈ సినిమాలో, పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్లతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.