తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయి?: సూటిగా ప్రశ్నించిన అమిత్ షా
- విమోచన దినోత్సవ కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ
- నిర్మల్ లో జరిగిన కార్యక్రమానికి అమిత్ షా హాజరు
- బలిదానాలు కేసీఆర్ కు పట్టవా అంటూ ఆగ్రహం
- వచ్చే ఎన్నికల్లో అన్ని లోక్ సభ సీట్లు గెలుస్తామని ధీమా
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లోక్ సభ సీట్లన్నింటిని బీజేపీనే గెలుస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ లభించినట్టవుతుందని, తాము మజ్లిస్ కు భయపడబోమని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తుందని వివరించారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ, ఈటల రాజేందర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు.