31,155 ఎకరాల డీకేటీ పట్టాలను గిరిజనులకు ఇచ్చాం: సీఎం జగన్
- హోం, గిరిజన శాఖలపై సీఎం జగన్ సమీక్ష
- అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చ
- గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్న సీఎం
- సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉద్ఘాటన
మునుపెన్నడూ లేని విధంగా గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. 31,155 ఎకరాల డీకేటీ పట్టాలను గిరిజనులకు అందజేశామని తెలిపారు. 19,919 మంది గిరిజనులు దీని ద్వారా లబ్దిపొందారని వివరించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న గిరిజనులకు రైతు భరోసా కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆ గిరిజనుల భూముల్లో బోర్లు వేశామని, పంటల సాగు కోసం కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు.
గిరిజనులకు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు, వలంటీర్లుగా అవకాశాలు కల్పించామని తెలిపారు. అంతేకాకుండా, ఆసరా, అమ్మఒడి, చేయూత, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.