ఢిల్లీలో సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం
- సీబీఐ ఆఫీసు బేస్ మెంట్ లో మంటలు
- ప్యానెల్ బోర్డు నుంచి మొదలైన అగ్నికీలలు
- రంగంలోకి 8 ఫైరింజన్లు
- ఆఫీసు నుంచి అధికారులు, సిబ్బంది తరలింపు
సీబీఐ కార్యాలయం బేస్ మెంట్ లో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు ప్రారంభమైనట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో గంట తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.