ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ ఏడేళ్లుగా కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని మరిచారు: కిషన్ రెడ్డి
- నేడు విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన బీజేపీ
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
- విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్
అసలు, ఎంఐఎం పార్టీకి కేసీఆర్ కుటుంబం ఎందుకు జీ హుజూర్, సలాం అంటోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం మోచేతినీళ్లు తాగుతూ కేసీఆర్ గత ఏడేళ్లుగా విమోచన దినోత్సవాన్నే మరిచారని విమర్శించారు. తెలంగాణలో సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.