కరోనా నిబంధనలతో పెరిగిన నేరాలు!
- నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడి
- నేరాల్లో నమోదైన 28 శాతం పెరుగుదల
- 2020లో 10 లక్షలపైగా ‘ఇతర ఐపీసీ నేరాలు’
అలాగే లాక్డౌన్లో బయటకు రాకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ చాలా మంది పోలీసుల దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా వల్ల దేశంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు సమాచారం. తాజాగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కేసులను ‘ఇతర ఐపీసీ నేరాల’ విభాగంలో నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేరాల సంఖ్య 2019లో 2,52,268గా ఉండగా, ఇది 2020లో 10,62,399కి చేరినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో లాక్డౌన్ కారణంగా మహిళలపై నేరాల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.