సాయి ధరమ్ తేజ్ వీడియో బయటకు రావడంపై నిఖిల్ ఆగ్రహం!
- అపోలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సాయితేజ్
- వైరల్ అవుతున్న సాయితేజ్ వీడియో
- ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతిస్తున్నారన్న నిఖిల్
మరోవైపు, ఈ వీడియోపై మరో హీరో నిఖిల్ మండిపడ్డాడు. వీడియో బయటకు రావడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతిస్తున్నారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. చికిత్స పొందుతున్న సాయితేజ్ వీడియో ఇలా బయటకు రావడం బాధాకరమని అన్నాడు. వ్యక్తి ప్రైవసీకి గౌరవాన్ని ఇవ్వాలని... కనీసం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఏకాంతానికైనా గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.