ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. నేడు బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యే రాజ్కుమార్
- టికెట్ ఇవ్వకపోవడంతో 2017లో బీజేపీని వీడిన రాజ్కుమార్
- వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తిరిగి కాషాయ గూటికి
- ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
- 2017 నుంచి ఇప్పటి వరకు ముగ్గురు సీఎంల మార్పు
ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2017 నుంచి ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. వచ్చే ఏడాది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్న బీజేపీ ఈసారి చాలా వరకు నియోజకవవర్గాల్లో కొత్త వారిని బరిలోకి దింపాలని యోచిస్తోంది.