మహబూబాబాద్ ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట.. జైలు శిక్ష రద్దు
- పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారంటూ కేసు
- ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించిన ప్రజా ప్రతినిధుల కోర్టు
- ప్రధాన నిందితుడి వాంగ్మూలం చెల్లదంటూ జైలు శిక్షను రద్దు చేసిన హై కోర్టు
దీంతో కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాలు చేశారు. నిన్న విచారణ జరగ్గా.. ప్రధాన నిందితుడు మహ్మద్ షౌకత్ వాంగ్మూలంతోనే శిక్ష విధించారని, ఈ నేరాంగీకార వాంగ్మూలం చట్ట ప్రకారం చెల్లదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును రద్దు చేస్తూ జైలు శిక్షను రద్దు చేశారు.