రాష్ట్ర ప్రభుత్వం మటన్ అమ్మడం ఏంటండీ.. నీచంగా!: రఘురామకృష్ణరాజు
- ఏపీలో మటన్ మార్ట్ లు
- రాష్ట్ర ప్రభుత్వ యోచన
- ఎద్దేవా చేసిన రఘురామ
- జగనన్న మాంసం దీవెన అంటూ వ్యంగ్యం
ఈ క్రమంలో ఓ దినపత్రికలో మటన్ మార్ట్ లకు సంబంధించిన కథనాన్ని లైవ్ లో చదివి వినిపించారు. ఇలాంటి వ్యాపారాలకు బదులు రైతులు పండించే కూరగాయలకు మెరుగైన ధరలు లభించేలా చూడాలని హితవు పలికారు. ప్రభుత్వం మటన్ బదులు కూరగాయలు అమ్మితే ఆ పథకం కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఈ పథకానికి జగనన్న కాయగూర దీవెన అని పేరుపెట్టుకోవాలని సూచించారు.