రూ. 4,660 కోట్ల కేసులో అనిల్ అంబానీకి సుప్రీంలో ఊరట
- రిలయన్స్ ఇన్ఫ్రా-ఢిల్లీ మెట్రో కేసులో అనిల్ అంబానీకి ఊరట
- రిలయన్స్ ఇన్ఫ్రాకు వడ్డీతో కలిపి చెల్లించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు
- 5 శాతం వరకు పెరిగిన రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ వాల్యూ
కేసు వివరాల్లోకి వెళ్తే... రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఒక విభాగం మన దేశంలో తొలి ప్రైవేటు రైలు సేవలను అందించేందుకు 2008లో ఒప్పందం చేసుకుంది. అయితే ఫీజు, నిర్వహణ అంశాల్లో వివాదం నెలకొనడంతో.. కాంట్రాక్టు నుంచి 2012లో బయటకు వచ్చేసింది. పరిహారం ఇవ్వాలంటూ ఢిల్లీ మెట్రోపై ఆర్బిట్రేషన్ కేసు దాఖలు చేసింది.