ఢిల్లీకి పోయి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు
- ఢిల్లీలో తెలంగాణ భవన్ ఎవరి కోసం కడుతున్నారు?
- టీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదు
- అన్ని జిల్లాల్లో దళితబంధు ఇవ్వాలి
దళితబంధు మాదిరే బీసీ బంధు, గిరిజన బంధు కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 80 శాతం మంది హిందువులు ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కేసీఆర్... దళితబంధు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.