vijaykanth: ఆసుప‌త్రిలో న‌ర్సుల‌తో కలిసి సినిమా చూసిన విజయ్ కాంత్!

  • అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న విజ‌య్ కాంత్
  • ప్రస్తుతం దుబాయ్‌లో చికిత్స‌
  • నర్సులతో కలసి ఫొటో దిగిన వైనం 
  • ఆరోగ్యం బాగుంద‌ని ట్వీట్  
vijay kant pics go viral

కోలీవుడ్ న‌టుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ చికిత్స కోసం  దుబాయ్ కి వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆసుప‌త్రిలో ఆయ‌న న‌ర్సుల‌తో క‌లిసి ఫొటోలు దిగారు.

ఇంద‌కు సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌నే స్వ‌యంగా త‌న‌ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  తాను ఆరోగ్యంగా ఉన్నానని, నర్సులతో కలిసి కాలక్షేపం చేశాన‌ని తెలిపారు.  తాను నటించిన క్షత్రియన్ సినిమాను ఆసుప‌త్రిలో నర్సు లతో కలిసి చూసిన‌ట్లు చెప్పారు.  

కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధప‌డుతోన్న విష‌యం తెలిసిందే. గ‌తంలోనూ ఆయ‌న ప‌లు సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అప్ప‌ట్లో అమెరికాలోనూ చికిత్స తీసుకుని తిరిగి వ‌చ్చారు. గత ఏడాది ఆయ‌న‌ కరోనా బారిన కూడా పడ్డారు. కరోనా సైడ్ ఎఫెక్టుల వల్ల ఆయ‌న‌ ఆరోగ్యం దెబ్బతిన్నట్టు కొన్ని నెలలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.  
             
 

More Telugu News