వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన కమలాపురం ఎమ్మెల్యే
- వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ
- నేటితో 90వ రోజుకు చేరిన విచారణ
- రవీంద్రనాథ్ రెడ్డిని విచారించిన సీబీఐ
- రవీంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ కు మేనమామ
కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సీబీఐ రవీంద్రనాథ్ రెడ్డిని విచారించింది. అనేక అంశాలపై ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇటీవల వివేకా హత్యకేసులో సీబీఐ అనేకమందిని విచారిస్తూ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కొందరిని పలుమార్లు విచారణకు పిలుస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది.