Nikhil: విదేశాలకి వెళుతున్న 'కార్తికేయ 2'

  • నిఖిల్ నుంచి 'కార్తికేయ 2'
  • విదేశాల్లో చివరి షెడ్యూల్ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • వచ్చే ఏడాదిలో విడుదల
Karthikeya 2 movie update

చందూ మొండేటి - నిఖిల్ కాంబినేషన్లో 'కార్తికేయ 2' సినిమా రూపొందుతోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన 'కార్తికేయ' భారీ విజయాన్ని నమోదు చేసింది. అందువలన అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేస్తూ, మొత్తానికి పట్టాలెక్కించారు. అయితే కరోనా కారణంగా అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. దాంతో పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడే షూటింగు కానిస్తూ వచ్చారు.

ఈ సినిమా చివరి షెడ్యూల్ ను విదేశాల్లో ప్లాన్ చేశారు. రెండువారాల పాటు అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తి కానుంది. అంటే ఈ నెల చివరినాటికి గుమ్మడికాయ కొట్టేస్తారట. ఆ తరువాత గ్రాఫిక్స్ వర్క్ ను పూర్తిచేసి, వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు. ఆల్రెడీ నిఖిల్ తో '18 పేజెస్' చేసిన అనుపమ పరమేశ్వరన్, 'కార్తికేయ 2'లోను జోడీ కడుతుండటం విశేషం.

More Telugu News