ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన కేసీఆర్
- 1100 గజాల స్థలంలో టీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం
- వసంత్ విహార్లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన
- వచ్చే ఏడాది దసరాలోగా పూర్తి చేయాలని యోచన
ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. దీంతో ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీల జాబితాలో గులాబి పార్టీ కూడా చేరనుంది.
ఇక ఈ భవన నిర్మాణాన్ని వచ్చే ఏడాది దసరా నాటికి ఎలాగైనా పూర్తిచేయాలనేది కేసీఆర్ యోచన. అలాగే భవన ప్రారంభోత్సవానికి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ ఢిల్లీ పర్యటన మూడు రోజులు సాగనుంది.