'ధన ప్రసాదం' కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ
- శ్రీవారి హుండీలో ప్రతి రోజు రూ. 10 నుంచి 20 లక్షల వరకు చిల్లర నాణేలు
- చిల్లరను తీసుకునేందుకు ముందుకు రాని బ్యాంకులు
- అతిథిగృహాల వద్ద రిసెప్షన్ కౌంటర్ల వద్ద 100 రూపాయల నాణేలను అందిస్తున్న టీటీడీ
అకామడేషన్ బుకింగ్ సమయంలో చెల్లించిన కాషన్ డిపాజిట్ ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో తిరిగి తెల్లించేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఒక రూపాయి నాణేలను ఇస్తున్నారు. రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేలను కూడా ఇవ్వబోతోంది. ఒకవేళ చిల్లర తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్ ను భక్తులకు చెల్లించనున్నారు.