జీవో 217 ప్రతులను తగలబెట్టిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
- జీవో 217 నేపథ్యంలో ధ్వజమెత్తిన రవీంద్ర
- మత్స్యకారుల పొట్ట కొట్టే విధంగా ఉందని విమర్శలు
- మత్స్యకారులను నిలువునా ముంచుతున్నారని వ్యాఖ్యలు
- జీవో రద్దు చేయాలని డిమాండ్
మంత్రి అప్పలరాజు తన పదవిని కాపాడుకోవడం కోసం మత్స్యకారులకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ కూర్చున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జీవో 217ని రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.