సంజయ్ రౌత్ శివసేన పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడు: కేంద్రమంత్రి రాణే
- మహారాష్ట్రలో రాణే వర్సెస్ శివసేన
- రాణే కుమారులపై సంజయ్ రౌత్ వ్యాఖ్యలు
- తీవ్రంగా స్పందించిన రాణే
- తన పత్రికలో వరుస కథనాలు రాస్తానని హెచ్చరిక
దీనిపై రాణే అదే రీతిలో బదులిచ్చారు. రౌత్ కారణంగా శివసేన పార్టీ భ్రష్టుపట్టిపోతోందని వ్యాఖ్యానించారు. రౌత్ తన వ్యాఖ్యలతో శివసేనను పతనం దిశగా తీసుకెళుతున్నాడని పేర్కొన్నారు. అంతేకాదు, శివసేన నేతలు తనపై వ్యక్తిగత విమర్శలు ఆపకపోతే, తన 'ప్రహార్' పత్రికలో వరుసగా విమర్శనాత్మక కథనాలు రాయాల్సి ఉంటుందని రాణే హెచ్చరించారు.