Roja: టీచర్ అవతారం ఎత్తిన రోజా... ఫొటోలు ఇవిగో!

  • చిత్తూరు జిల్లాలో అభివృద్ధి పనులు
  • ఆధునికీకరించిన అత్తూరు జడ్పీ హైస్కూల్ భవనం
  • ప్రారంభించిన రోజా
  • విద్యార్థులకు భూమి-మనం పాఠం
YCP MLA Roja turns teacher

రాజకీయాలు, ప్రజాభివృద్ధి పనులతో బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉపాధ్యాయురాలిగా మారారు. చిత్తూరు జిల్లా అత్తూరు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. సాంఘికశాస్త్రంలోని భూమి-మనం అనే పాఠాన్ని బోధించారు. పాఠం చెప్పిన అనంతరం తాను చెప్పిన విషయాలు అర్థమయ్యాయో లేదో తెలుసుకునేందుకు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అత్తూరులోని జడ్పీ హైస్కూల్ భవనాన్ని ఇటీవల ఆధునికీకరించారు. ఈ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా రోజా టీచర్ అవతారమెత్తారు.

More Telugu News