ప్రియుడితో పెళ్లి చేస్తారా.. దూకేయమంటారా?: వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి హల్చల్
- పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘటన
- ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
- ప్రియుడిని ఒప్పించి ఇద్దరికీ పెళ్లి చేసిన పోలీసులు
భాస్కర్తో తనకు వివాహం చేయకుంటే పైనుంచి దూకేస్తానని హెచ్చరిస్తూ కుటుంబ సభ్యులకు వాట్సాప్ వీడియో పంపింది. అది చూసి కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతితో ఫోన్లో మాట్లాడారు. భాస్కర్ను తీసుకొచ్చి వివాహానికి ఒప్పించారు. దీంతో కేశవాణి కిందికి దిగింది. అనంతరం ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి ఇద్దరికీ వివాహం జరిపించడంతో కథ సుఖాంతమైంది.