USA: కాబూల్ పేలుళ్లపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

  • తాను అధ్యక్షుడినై ఉంటే దాడులు జరిగేవి కాదన్న ట్రంప్
  • కాబూల్ విమానాశ్రయం పరిసరాల్లో రెండు బాంబు పేలుళ్లు
  • 100 మందికిపైగా మృతి.. వారిలో 13 మంది అమెరికా సైనికులు
Former US President Trump responds to the Kabul bombings

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రజలను తరలించడానికి మిగిలిన ఏకైక మార్గం కాబూల్ విమానాశ్రయం. అక్కడి నుంచే వివిధ దేశాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ గురువారం నాడు రెండు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 100 మందికిపైగా మరణించారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దాడులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో ఈ బాంబు పేలుళ్లపై అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘‘నేను మీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇలాంటి విషాదం అసలు జరిగేది కాదు’’ అన్నారు. ఈ దాడులపై అంతకు ముందే స్పందించిన ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్.. కారకులపై పగ తీర్చుకుంటామని ప్రకటించారు. కాగా, ఈ దాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News