Telangana: తెలంగాణలో మరో 339 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona positive cases and deaths media report
  • గత 24 గంటల్లో 80,568 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 91 కేసులు
  • మూడు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • ఇంకా 6,166 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 80,568 కరోనా పరీక్షలు నిర్వహించగా, 339 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 91 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 31, ఖమ్మం జిల్లాలో 28 కేసులు గుర్తించారు. కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 417 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,56,794 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,46,761 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,166 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,867కి చేరింది.

  • Loading...

More Telugu News