కాబూల్ పేలుళ్లపై ప్రపంచమంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది: భారత్
- హమీద్ కర్జాయ్ ఎయిర్ పోర్టు వద్ద పేలుళ్లు
- ఆత్మాహుతి దాడులు జరిపిన ఐసిస్
- ఇప్పటివరకు 90 మంది మృతి
- ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని ఉపేక్షించరాదన్న భారత్
టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారిని ఉపేక్షించరాదన్న విషయం ఈ ఘటన ద్వారా బోధపడుతోందని పరోక్షంగా పాకిస్థాన్ కు చురకలంటించింది. కాబూల్ పేలుళ్ల ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం ప్రగాఢ సంతాపం తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.