Afghanistan: 'ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి' చేప‌ట్టిన భార‌త్.. ఆఫ్ఘ‌న్ నుంచి మ‌రో 78 మంది త‌ర‌లింపు.. వీడియో ఇదిగో

India operation of evacuation from Afghanistan called Operation Devi Shakti
  • ఆఫ్ఘనిస్థాన్ లో రెచ్చిపోతోన్న‌ తాలిబ‌న్లు
  • భార‌త్ వ‌స్తోన్న 78 మందిలో 25 మంది భార‌తీయులు
  • దుషన్బే మీదుగా తీసుకొస్తున్న అధికారులు

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబ‌న్లు రెచ్చిపోతుండ‌డంతో ఆ దేశ రాజ‌ధాని కాబూల్ లోని విమానాశ్ర‌యం నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు భార‌త్ చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ దేవి శ‌క్తిగా పేరు పెట్టింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ట్వీట్ చేశారు.

ఈ రోజు భార‌తీయులు స‌హా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి త‌జ‌కిస్థాన్‌లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఆప‌రేష‌న్ చేప‌డుతోన్న భార‌త వైమానిక సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

కాగా, దుషన్బే నుంచి భార‌త్ కు 25 మంది భార‌తీయులు స‌హా 78 మంది విమానంలో బ‌య‌లుదేరిన వీడియోను ఓ అధికారి పోస్ట్ చేశారు. మరోపక్క, ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌సిద్ధ గ‌జిని ప్రావిన్స్ గేటును తాలిబ‌న్లు కూల్చివేశారు. ఇందుకు స‌బంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

  • Loading...

More Telugu News