Andhra Pradesh: ఏపీలో మరో 1,085 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 57,745 కరోనా పరీక్షలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 137 కేసులు
  • రాష్ట్రంలో 8 మంది మృతి
  • ఇంకా 14,677 మందికి చికిత్స
Andhra Pradesh Covid cases and deaths bulletin

ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 57,745 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,085 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 137 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 130,  ప్రకాశం జిల్లాలో 122, గుంటూరు జిల్లాలో 116, నెల్లూరు జిల్లాలో 108, తూర్పుగోదావరి జిల్లాలో 105 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,541 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,02,340 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,73,940 మంది పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,677 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,723కి పెరిగింది.

  • Loading...

More Telugu News