నిన్న ఆఫ్ఘనిస్థాన్ నుంచి 3,000 మందిని విమానాల్లో తరలించిన అమెరికా
- సెప్టెంబరు 11 నాటికి ఆఫ్ఘన్ నుంచి బలగాలు పూర్తిగా ఉపసంహరణ
- ఇప్పటివరకు ఆఫ్ఘన్ నుంచి అమెరికాకు 14,000 మంది
- ఆఫ్ఘన్లో తమకు సహకరించిన వారికీ అమెరికా రక్షణ
ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే కాబూల్ విమానాశ్రయం నుంచి 16 సీ-17 విమానాల ద్వారా దాదాపు 3,000 మందిని అమెరికాకు తీసుకెళ్లినట్లు తెలిపారు. వారిలో 350 మంది అమెరికా పౌరులు కూడా ఉన్నారని చెప్పారు. దీంతో జులై చివరి వారం నుంచి ఇప్పటివరకు మొత్తం 14,000 మందిని అమెరికాకు తరలించినట్టు శ్వేతసౌధం అధికారులు ఈ రోజు ప్రకటించారు.
ఇక అమెరికా పౌరులనే కాకుండా ఆఫ్ఘన్లో అమెరికా, నాటో దళాలకు సహకరించిన వారి కుటుంబాలను, ప్రత్యేక వీసాలు ఉన్నవారిని కూడా కాబూల్ నుంచి తీసుకెళ్తున్నారు. గత 24 గంటల్లో అదనంగా 11 చార్టర్ విమానాలను కూడా వాడినట్లు శ్వేతసౌధం అధికారులు పేర్కొన్నారు.