ఏపీలో కరోనా వల్ల అనాథలైన పిల్లలు ఎంత మంది ఉన్నారంటే..!
- ఏపీలో కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంఖ్య 6,800
- బాధిత పిల్లలకు పాఠశాలల్లో నమోదు ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశం
- ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు కూడా విద్యాకానుక కిట్ అందజేత
కరోనా బాధితులుగా మారిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినన నేపథ్యంలో అనాథలైన పిల్లల వివరాలను సేకరించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. వీరందరికీ వెంటనే పాఠశాలల్లో నమోదు ప్రక్రియను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా విద్యాకానుక కిట్ ను అందించాలని చెప్పింది.