Ghulam Hassan Lone: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం... అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ మృతి

  • కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
  • హసన్ లోన్ నివాసం వద్ద కాల్పులు
  • కుప్పకూలిన నేత
  • సంతాపం తెలిపిన మెహబూబా, ఒమర్
Terrorists killed Apni party leaders Ghulam Hassan Lone

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఏకంగా ఓ రాజకీయ పార్టీ నాయకుడిని బలిగొన్నారు. అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు వదిలారు. కుల్గాం జిల్లా దేవ్ సర్ లోని హసన్ లోన్ నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ సాయంత్రం కొందరు సాయుధులు ఆయన ఇంటి వద్ద తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో లోన్ కుప్పకూలారు. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

హసన్ లోన్ 4 నెలల కిందటే అప్నీ పార్టీలో చేరారు. ఆయన గతంలో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)లో కొనసాగారు. హసన్ లోన్ మృతిపై మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు.

More Telugu News