Kurnool District: కర్నూలు జిల్లా రథోత్సవంలో విషాద ఘటన.. కరెంట్ షాక్ తో ఇద్దరి మృతి

  • ఆదోని మండలం పెసలబండలో చింతాల మునిస్వామి రథోత్సవం
  • మృతులు వెంకటేశులు, వీరాంజనేయులు   
  • మరో ఇద్దరికి గాయాలు
Two died in Kurnool district during Rathotsavam

కర్నూలు జిల్లాలో జరిగిన రథోత్సవంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే, ఆదోని మండలం పెసలబండలో చింతాల మునిస్వామి రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విద్యుదాఘాతంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను అదే గ్రామానికి చెందిన వెంకటేశులు, వీరాంజనేయులుగా గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పెసలబండలో విషాదం నెలకొంది.

More Telugu News