Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్!

  • 'ఉప్పెన'తో భారీ క్రేజ్
  • క్రిష్ ప్రాజెక్టు పూర్తి
  • కీలక పాత్రలో రకుల్
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
Krish movie update

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తొలి సినిమా చేశాడు. 'కొండపొలం' అనే ఒక కథ ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. క్రిష్ ఈ సినిమాను 40 రోజుల్లోనే పూర్తి చేశాడు. అయితే కొన్ని కారణాల వలన విడుదల విషయంలో ఆలస్యం జరగడం వలన, 'ఉప్పెన' సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

క్రిష్ సినిమాను ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకూ ఈ సినిమాకు టైటిల్ ను నిర్ణయించలేదు. ఇప్పుడు టైటిల్ తో కూడిన ఫస్టు పోస్టర్ ను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. ఆ రోజున ఉదయం 10:15 నిమిషాలకు ఈ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇది గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ .. చాలా తక్కువ పాత్రలతో ఎమోషన్ తో నడిచే కథ. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇక టైటిల్ పోస్టర్ ను వదిలిన దగ్గర నుంచి ప్రచార చిత్రాలను వెంటవెంటనే రిలీజ్ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఈ కథతో క్రిష్ ఏం చెప్పదలచుకున్నాడో చూడాలి.

More Telugu News