Telangana: తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 87,230 కరోనా పరీక్షలు
  • 417 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 84 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 6,939 మందికి చికిత్స
Telangana daily corona cases report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 87,230 కరోనా పరీక్షలు నిర్వహించగా, 417 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 84 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 54 కేసులు వెల్లడయ్యాయి. జోగులాంబ గద్వాల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 569 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,202 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,42,416 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,939 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,847కి పెరిగింది.

More Telugu News