మహబూబాబాద్ జిల్లాలో నేడు షర్మిల ఉద్యోగ దీక్ష.. రేపటి నుంచి పోడు యాత్ర ప్రారంభం
- సోమ్ల తండాలో సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల
- అనంతరం గుండెంగా గ్రామంలో ఉద్యోగ దీక్ష
- రాత్రి వరంగల్ లో బస
జిల్లాలోని సోమ్ల తండాలో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. అనంతరం అదే జిల్లాలోని గుండెంగి గ్రామంలో ఆమె ఉద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఆ తర్వాత రాత్రి వరంగల్ లో బసచేయనున్నారు. రేపు పోడు భూములపై పోరాటాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా లింగాల గ్రామంలో పోడు యాత్రను నిర్వహించనున్నారు. ఆ తర్వాత రేపు సాయంత్రానికల్లా హైదరాబాదుకు చేరుకుంటారు.