కర్నూలు జిల్లాలో వార్డు వాలంటీర్ ఆత్మహత్య
- కోడుమూరులో హబీబ్ బాషా ఆత్మహత్య
- హబీబ్ కు పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు
- 5 వేల జీతంతో కుటుంబాన్ని పోషించడం కష్టమనే భావనతో ఆత్మహత్య
అయితే, ప్రభుత్వం ఇచ్చే రూ. 5 వేల వేతనంతో పెళ్లైన తర్వాత కుటుంబాన్ని పోషించం కష్టమని హబీబ్ బాధపడేవాడు. ఇదే విషయాన్ని తన తండ్రితో కూడా చెప్పేవాడు. చివరకు ఒత్తిడికి తట్టుకోలేక నిన్న మధ్యాహ్నం ఇంట్లోనే ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం 3 గంటలకు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కొడుకు శవమై కనిపించడంతో తట్టుకోలేకపోయారు. అండగా ఉంటాడనుకున్న కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.